మనుషుల ప్రాణాలతో చెలగాటమాడిన వ్యక్తికి రాజ్యసభ సీటు

మనుషుల ప్రాణాలతో చెలగాటమాడిన వ్యక్తికి రాజ్యసభ సీటు

మనుషుల ప్రాణాలతో చెలగాటమాడిన వ్యక్తికి రాజ్యసభ సీటు ఇవ్వడమేంటని ప్రశ్నించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. రెమెడెసివిర్ పేరుతో భారీ స్కాం జరిగిందని ఆరోపించారు. పార్థసారథిపై ఎలక్షన్ కమిషన్ కు, సీబీఐ కి లేఖరాస్తానన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావొద్దని బీజేపీ, టీఆర్ఎస్ ప్లాన్ చేశాయని.. దానికోసం పార్థసారథిని వాడుతున్నారన్నారు జగ్గారెడ్డి.

ప్రతి ఇంజెక్షన్ లక్ష వరకు విక్రయించారని..ఇంత పెద్ద స్కాం చేయడానికి పార్థసారథికి సిగ్గనిపించేలలేదా అని మండిపడ్డారు. పార్థసారథి వద్ద దొరికిన 500కోట్లపై కేసు అయిందా లేదా అని ఆయన ప్రశ్నించారు. పార్థసారథిపై ఐటీ రైడ్స్ లో ఏం జరిగిందో ఇప్పటివరకు బయటకు రాలేదన్నారు. ఐటీ రైడ్స్ లో 10వేల కోట్ల వరకు బయటపడి ఉంటాయనే అనుమానం కల్గుతుందన్నారు.అలాంటి వ్యక్తికి టీఆర్ఎస్ రాజ్యసభ టికెట్ ఎలా ఇచ్చిందని జగ్గారెడ్డి నిలదీశారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెమిడిసివిర్ బాగోతం బయటపెడతామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

 

మరిన్ని వార్తల కోసం

డాక్టర్ ను సస్పెండ్ చేసిన మంత్రి హరీష్ రావు

వర్షానికి వణికిన ఢిల్లీ .. కూలిన ఇళ్లు, చెట్లు