ఎవరు, ఎవరితో టచ్లో ఉన్నారో ఎన్నికల తర్వాత తెలుస్తది : జగ్గారెడ్డి

ఎవరు, ఎవరితో టచ్లో ఉన్నారో ఎన్నికల తర్వాత తెలుస్తది :  జగ్గారెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో  ఉన్నారంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసిన కామెంట్స్ కు   పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు.  తమ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్ కి టచ్ లో ఉన్నారా? వాళ్ళ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారా? అనేది పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యాక తెలుస్తుందన్నారు.  ఏప్రిల్ 19వ తేదీ  శుక్రవారం రోజున  గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఏం మాట్లాడినా తిప్పికొట్టే వ్యూహాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. కాంగ్రెస్ లో అందరూ తోపులేనని..  కాంగ్రెస్‌లో లీడర్లకు కొదవ లేదని చెప్పారు  

కేసీఆర్ ఏం చేసినా తమకు ఏం కాదన్నారు. జగ్గారెడ్డి.  కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని... ఆయన మాటలు ఎవరు పట్టించుకోవడం లేదని తెలిపారు.  కేసీఆర్ మాటలకు ఆగస్టులో సమాధానం చేప్తానన్నారు జగ్గారెడ్డి.  రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. అసలైన దేశభక్తులు రాహుల్ గాందీ కుటుంబమే అన్నారు. దేశభక్తి అంటూ డబ్బా కొట్టుకునే బీజేపీకి నార్త్ లో గ్రాఫ్ పడిపోయిందని అన్నారు.  బీజేపీ గ్రాఫ్ పడిపోవడంతో మోదీ, అమిత్ షాకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. రాహుల్ చేపట్టిన పాదయాత్రతో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందన్నారు జగ్గారెడ్డి.