జగ్గారెడ్డి ఫుల్​ ఖుషి.. చేతిలో చెయ్యివేసి ప్రత్యేకంగా మాట్లాడిన రాహుల్

జగ్గారెడ్డి ఫుల్​ ఖుషి.. చేతిలో చెయ్యివేసి ప్రత్యేకంగా మాట్లాడిన రాహుల్

న్యూఢిల్లీ, వెలుగు: సొంత పార్టీ నేతల దుష్ప్రచార తీరుపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిని హైకమాండ్ బుజ్జగించింది. ఏకంగా రాహుల్ గాంధీ తన చేతిలో చేయి వేసి.. ఒంటరిగా మాట్లాడడంతో జగ్గారెడ్డి ఫుల్ ఖుషి అయ్యారు. వాస్తవానికి ఏఐసీసీలో స్ట్రాటజీ కమిటీ మీటింగ్ లో పాల్గొనే ముందు జగ్గారెడ్డి సొంత పార్టీ ముఖ్య నేతలపై విమర్శలు గుప్పించారు. ఉత్తమ్, తనను, ఇతర నాయకులను కొందరు టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తమపై జరుగుతున్న దుష్ప్రచారాలను ఖర్గే, రాహుల్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

ALSO READ:సిటిజన్లకు రెయిన్ అలర్ట్ మెసేజ్​లు..టెలికాం సంస్థల సహకారంతో పంపుతున్న డీఆర్ఎఫ్

అయితే, మీటింగ్ తర్వాత రాహుల్ గాంధీ, జగ్గారెడ్డి ఒక్కరినే చేతిలో చేయి వేసుకొని ఏఐసీసీ ఆఫీసు వరండా నుంచి 10 జన్ పథ్ లోని లోపలి గేటు వైపు తీసుకెళ్లారు. ఒక రెండు నిమిషాల తర్వాత కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాలు జగ్గారెడ్డి భుజంపై చేయి వేసి బయటకు తీసుకొచ్చారు. ఈ సందర్భంలో రెండు నిమిషాలు ఏకాంతంగా జగ్గారెడ్డి పార్టీలో నేతల తీరును వేణుగోపాల్ కు వివరించారు.