పోలీస్ పతకాలకు జగిత్యాల జిల్లా పోలీసుల ఎంపిక

పోలీస్ పతకాలకు జగిత్యాల జిల్లా పోలీసుల ఎంపిక

జగిత్యాల టౌన్, వెలుగు: పోలీస్‌‌‌‌‌‌‌‌ శాఖలో విశేష సేవలందించినందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిషాత్మకమైన పోలీస్‌‌‌‌‌‌‌‌ పతకాలకు 17మంది జిల్లా పోలీసులు ఎంపికయ్యారు. ఎంపికైన సిబ్బందిని ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు. ఉత్తమ సేవా పతకానికి ఏఆర్ ఎస్ఐ రామస్వామి, డిస్ట్రిక్ట్​ స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ శ్రీనివాస్ ఎన్నికయ్యారు.

సేవా పతకాలకు మెట్‌‌‌‌‌‌‌‌పల్లి ఏఎస్ఐలు జమీల్ అహ్మద్, నరసింహారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ భిక్షపతి, కోరుట్ల ఏఎస్ఐ సత్తయ్య, జగిత్యాల ఏఆర్ ఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్స్‌‌‌‌‌‌‌‌ రవి, మల్లారెడ్డి, నాయక్, శ్రీనివాస్, ప్రకాశ్‌‌‌‌‌‌‌‌, ఇలియాస్ అహ్మద్, రాజమౌళి, తనోబా, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్స్ నాగన్న, మల్లారెడ్డి ఎన్నికయ్యారు.