
రాయికల్, వెలుగు: జగిత్యాల జిల్లా రాయికల్ మండలానికి చెందిన వ్యక్తి దుబాయ్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని కట్కాపూర్ గ్రామానికి చెందిన భూమయ్య(43) కొద్ది నెలల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. కంపెనీ యజమాన్యం కొన్ని నెలలుగా జీతం ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన భూమయ్య గురువారం గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు దుబాయ్ నుంచి ఆయన ఫ్రెండ్స్కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం, నాయకులు స్పందించి స్వగ్రామానికి మృతదేహం తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.