భూవివాదంలో జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి 

భూవివాదంలో జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి 

జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై తన కూతురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదారాబాద్‌ ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ముత్తిరెడ్డిపై సొంత కూతురు తుల్జా భవాని రెడ్డి కంప్లైంట్ చేశారు. 

నాచారంలోని  159 గజాల కమర్షియల్ బిల్డింగ్ విషయంలో తండ్రి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కూతురు తుల్జా భవాని రెడ్డి ఫిర్యాదు చేశారు. కినారా గ్రాండ్ కు అక్రమంగా అగ్రిమెంట్ చేశారని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫిర్యాదు చేశారు. సెక్షన్ 406, 420, 463,464,468, 471, R/w  34ipc,156 (3) CRPC  ప్రకారం కేసులు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. 

ముత్తిరెడ్డిపై సొంత కూతురే ఇలా ఫిర్యాదు చేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఏమైనా.. కుటుంబ కక్షలున్నాయా..? లేదా రాజకీయపరంగా బేధాభిప్రాయాలు వచ్చాయా..? లేదా ఇంకేవైనా కారణాలున్నాయా..? అనేదానిపై  చర్చించుకుంటున్నారు. 

ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై చాలా కాలంగా భూకబ్జాల ఆరోపణలు పెద్దఎత్తున్న వస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పుడు సొంత కూతురే తండ్రిపై కంప్లైంట్ చేయటంతో మరోసారి ఈ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు.. ఎన్నికల సమయం కావటంతో ఈ వివాదం కాస్తా విపక్షాలకు ఓ అస్త్రంగా మారే అవకాశం ఉంది.