చేర్యాల, వెలుగు: జనగామ, సిద్దిపేట హైవేపై కల్వర్టును లారీ ఢీకొట్టడంతో డ్రైవర్చనిపోగా, క్లీనర్కు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూర్ నుంచి సిరిసిల్ల కు సబ్బులు, సర్ఫ్ లోడ్తో వస్తున్న లారీ వీరన్నపేట స్టేజి వద్ద కల్వర్టును ఢీకొట్టి పల్టీ కొట్టింది.
లారీ డ్రైవర్ షేక్ మౌలాలి(51)పై లారీ క్యాబిన్ పడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. క్లీనర్ కరీముల్లాకు తీవ్రగాయాలవగా, చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తులో ఉండడంతోనే లారీ అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టినట్లు భావిస్తున్నారు. మృతుడి బంధువు జానీ బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అపూర్వారెడ్డి తెలిపారు.
