- లక్ష ఓట్లతో గెలిపిస్తామన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
- స్టేషన్ఘన్పూర్లో విభేదాలకు ఫుల్స్టాప్
- సముచిత స్థానమిస్తామన్న హామీతో మెత్తబడ్డ రాజయ్య
హైదరాబాద్, వెలుగు: జనగామ టికెట్పల్లా రాజేశ్వర్రెడ్డికే ఇవ్వబోతున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్క్లారిటీ ఇచ్చారు. మినిస్టర్స్క్వార్టర్స్లో మంగళవారం జనగామ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, జనగామ టికెట్ఆశించిన మండల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్ ఈ సమావేశంలో మాట్లాడుతూ, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్పదవి ఇచ్చామని, భవిష్యత్లో మరింత గౌరవం కల్పిస్తామన్నారు. ప్రజలు మూడోసారి కేసీఆర్ను గెలిపించి రికార్డ్ సృష్టించాలని పిలుపునిచ్చారు. సాధించుకున్న తెలంగాణను ఈనగాచి నక్కల పాలు చేయొద్దని, కాంగ్రెస్ లాంటి ముదనష్టపు పార్టీ చేతిలో పెట్టొద్దన్నారు. కాంగ్రెస్ లీడర్లు జనగామలో పాగా వేయాలని చూస్తున్నారని వారికి అవకాశం ఇవ్వొద్దన్నారు.
ఈనెల 16న జనగామలో సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. స్టేషన్ఘన్పూర్ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కూడా ఈ సమావేశానికి పిలిపించి కేటీఆర్ మాట్లాడారు. ఘన్పూర్లో కడియం శ్రీహరి విజయానికి కృషి చేయాలని, భవిష్యత్తులో సముచిన స్థానం ఇస్తామని చెప్పారు. దీంతో కడియంతో కలిసి పనిచేస్తానని రాజయ్య ఆయనకు తెలిపారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ, 16న నిర్వహించే జనగామ ఎన్నికల ప్రచార సభ దద్దరిల్లాలని.. 70 వేల మందిని ఈ సభకు తరలించాలన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ, ఎట్టిపరిస్థితుల్లోనూ జనగామ నియోజకవర్గాన్ని కాంగ్రెస్పాలు కానియ్యనన్నారు.
జనగామలో బీఆర్ఎస్కు 70 వేల నుంచి లక్ష ఓట్ల మెజార్టీ వస్తదని సర్వేలు చెప్తున్నాయని, అంత మెజార్టీ సాధించి కేసీఆర్కు కానుక ఇస్తామన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ, 16న కేసీఆర్బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ సమావేశానికి జనగామ నుంచి టికెట్ ఆశించిన నాగపురి కిరణ్కుమార్గౌడ్, ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్సీ రాజలింగంహాజరు కాకపోడం గమనార్హం..