వ్యవసాయ మార్కెట్ ను అభివృద్ధి చేస్తాం : బనుక శివరాజ్యాదవ్

వ్యవసాయ మార్కెట్ ను అభివృద్ధి చేస్తాం :  బనుక శివరాజ్యాదవ్

జనగామ అర్బన్, వెలుగు: జనగామ వ్యవసాయ మార్కెట్​అభివృద్ధి కోసం ఏఎంసీ పాలకవర్గం నిత్యం కృషి చేస్తుందని జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్మన్​ బనుక శివరాజ్​యాదవ్​ అన్నారు. శనివారం ఏఎంసీ ఆఫీస్​లో చైర్మన్​ అధ్యక్షతన పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగామ ఏఎంసీ యార్డులో నూతన 5000 టన్నుల గోదాం నిర్మాణం, మార్కెట్​యార్డ్​లో సోలార్​ లైటింగ్, లింగాల ఘనపూర్, రఘునాథపల్లి మండలాల్లోని 5000 టన్నుల నాబార్డ్​ గోదాములకు రోడ్ల నిర్మాణం, పెండింగ్ ​పనులు కూడా తొందర్లో పూర్తి చేస్తామన్నారు. 

అనంతరం మార్కెట్​యార్డులో పనిచేస్తున్న కార్మికుల కోసం సంఘం నాయకులు నూతన బిల్డింగ్​నిర్మాణం చేయాలని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి జీవన్​ కుమార్, ఏఎంసీ వైస్​ చైర్మన్ శివ, డైరెక్టర్లు తదితరులు  పాల్గొన్నారు.