ప్రగతి భవన్కు జనగామ పంచాయతీ..రాజీ కుదిరేనా?

ప్రగతి భవన్కు జనగామ పంచాయతీ..రాజీ కుదిరేనా?

జనగామ టికెట్ పంచాయతీ ప్రగతి భవన్ కు చేరింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి,  ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి భేటీ అనంతరం  టికెట్ ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

 జనగామ టికెట్ పై గత కొన్ని రోజులుగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి,  పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య హాట్ ఫైట్ నడుస్తోంది.  టికెట్ కోసం ఇద్దరు  పోటీపడుతుండగా అధిష్టానం పెండింగ్ లో పెట్టింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు మంత్రి కేటీఆర్  ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు.

Also Read : తెలంగాణకు మరో వందే భారత్ రైలు

ఇప్పటికే స్టేషన్ ఘన్ పూర్ వివాదానికి పుల్ స్టాప్ పెట్టారు కేటీఆర్. ప్రగతి భవన్ లో  కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో భేటీ అయిన కేటీఆర్  ఇద్దరి   మధ్య రాజీ కుదిర్చారు.  ఇద్దరం కలిసి పనిచేస్తామని ప్రకటించారు. రాజయ్య మద్దతులో భారీ మెజారిటీతో గెలుస్తానని ప్రకటించారు కడియం.