రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

రోడ్డు ప్రమాదంలో పంజాగుట్ట కానిస్టేబుల్ మృతి చెందాడు.  నర్మెట నుంచి ఆటోలో జనగామకు వెళ్తుండగా నర్మెట శివారులో  రోడ్డు ప్రమాదం జరిగింది.  ఆటోలో నుంచి కిందపడ్డ స్వామి తలకు తీవ్ర గాయం కావడంతో అతను చనిపోయాడు.


జనగామ జిల్లా నర్మెట మండలంలోని వెల్దండకు చెందిన గోల్కొండ స్వామి (36) హైద్రాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. నర్మెట నుంచి ఆటోలో జనగామకు వెళ్తుండగా నర్మెట–హన్మంతాపూర్ మధ్యలో రోడ్డు ప్రమదం జరిగింది. ఈ సమయంలో ఆటోలో నుంచి కిందపడ్డ స్వామి తలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రుడిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.