అందం, ప్రతిభ, నటనా కౌశలంతో ఆకాశమే హద్దుగా దూసుకెళుతోంది అలనాటి అందాల నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్(Janhvi Kapoor). శ్రీదేవి నటవారసురాలిగా సినీరంగ ప్రవేశం చేసిన జాన్వీ తదుపరి తనదైన శైలి, విలక్షణ ప్రతిభతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియాల్లో జాన్వీ కపూర్కి యూత్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. జాన్వీ నిరంతర ఫొటోషూట్లు, వీడియో షూట్లకు భారీగా యువతరంలో ఫాలోయింగ్ ఉంది.
లేటెస్ట్గా జాన్వీ కపూర్ షేర్ చేసిన ఓ ఫోటోషూట్ అంతర్జాలంలో చర్చగా మారింది. జాన్వీ మిరుమిట్లు గొలిపే ఫ్రాక్ ధరించి..నీళ్లలో కిల్లర్ భంగిమలతో మతులు చెడగొట్టింది.కుర్రోళ్ళకి మత్తకళ్లతో చిత్తు చేసింది ఈ అమ్మడు.
ఈ ఫొటోలను చూస్తున్న యువతరం 'మత్తు కళ్ల జవానీ!' అంటూ జాన్వీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. డార్క్ థీమ్లో వెట్ లుక్లో కనిపించిన జాన్వీకపూర్ అందానికి ఫిదా అయిపోతున్నారంతా. ఓర చూపులతో వలలు విసిరిన జాన్వీ కుర్రకారుకు మైకం కమ్మేంతగా కవ్విస్తోందంటూ కామెంట్స్ విసురుతున్నారు.
ప్రస్తుతం జాన్వీ తెలుగులో ఎన్టీఆర్(NTR) తో దేవర(Devara) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా పూర్తవ్వకముందే..జాన్వీ ముందు వరుస ఆఫర్లు క్యూకట్టాయి. శ్రీదేవి నటవారసురాలైన జాన్వీని తెరపై చూసుకుని ఆనందించాలని తెలుగు ఆడియాన్స్ వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా దేవర నుంచి జాన్వీ పల్లెటూరి పడుచులా కనిపిస్తోన్న పోస్టర్ రిలీజ్ అయ్యాక..వేయి కళ్ళతో ఎదురు చేస్తూ..కళ్ళల్లో ఒత్తులేసుకుంటున్నారు ఫ్యాన్స్.