చొప్పదండి, వెలుగు: కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి గాను 9వ, 11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం లేటరల్ఎంట్రీ సెలక్షన్ టెస్ట్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 9వ తరగతికి, టెన్త్ చదువుతున్న విద్యార్థులు 11వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
లేటరల్ ఎంట్రీ టెస్ట్ 2027 ఏప్రిల్ 10న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, దరఖాస్తులు సమర్పించేందుకు ఈ నెల 30 చివరి తేదీ అన్నారు. అర్హత గల విద్యార్థులు 9వ తరగతి కోసం <https://cbseitms.nic.in/2026/nvsix 9/>, 11వ తరగతి కోసం<https://cbseitms.nic.in/2026/nvsxi> 11/ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలు, అవసరమైన ధ్రువపత్రాలు, దరఖాస్తు విధానం కోసం నవోదయ విద్యాలయంలో సంప్రదించవచ్చని ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ సూచించారు.
