సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కొడుకు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రాషా థడానీ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కీలకమైన మూడో షెడ్యూల్ తిరుపతిలో సక్సెస్ఫుల్గా పూర్తయినట్టు మేకర్స్ తెలియజేశారు.
#SrinivasaMangapuram shoot is progressing at a rapid pace 💥💥💥
— Chandamama Kathalu Pictures (@CKPicturesoffl) March 6, 2026
The team recently wrapped up a key schedule in Tirupati, and with this, 60% of the filming has been completed ❤️🔥
More exciting updates coming soon 🔥
An @DirAjayBhupathi Film pic.twitter.com/g19HmlPhu0
ఈ షెడ్యూల్లో జయ కృష్ణ, రాషా తడానితోపాటు ప్రధాన తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ పూర్తవడంతో దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయిందని, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కూడా శరవేగంగా జరుగుతోందని టీమ్ చెప్పింది. మోహన్బాబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
