రోకలిబండతో భార్యను చంపిన భర్త.. ఇంట్లో కాలు జారి పడినట్టుగా చిత్రీకరణ..

రోకలిబండతో భార్యను చంపిన భర్త.. ఇంట్లో కాలు జారి పడినట్టుగా చిత్రీకరణ..

కట్టుకున్న భర్తే భార్యను దారుణంగా హతమార్చిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. భార్య చిగురు సంధ్యను రోకలి బండతో భర్త గణేష్ కొట్టి చంపాడు. 

భార్యను ఓ భర్త దారుణంగా చంపిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఒడిపిలవంచలో చోటు చేసుకుంది. భార్య చిగురు సంధ్యను రోకలి బండతో కొట్టి భర్త గణేష్ హతమార్చాడు. ఆపై ఇంట్లో కాలు జారి కిందపడినట్లు చిత్రికరించాడు. దంపతుల మధ్య అదనపు వరకట్నం విషయంలో గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గొడవ ఎక్కువై కోపాన్ని ఆపుకోలేక సంధ్యను గణేష్ హతమార్చినట్టు సమాచారం. గణేష్, సంధ్య దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.