విజయనగరం జాయింట్ కలెక్టర్ చేసిన సర్ ఫ్రైజింగ్ పనికి అందరూ మెచ్చుకుంటున్నారు. సినిమా స్టైల్లో మారు వేశంలో వచ్చి కూరగాయల మార్కెట్ లో తనిఖీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. విజయనగరం జిల్లాలో లాక్ డౌన్, 144 సెక్షన్ కారణంగా నిత్యావసర వస్తువులు, కొరగాయలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కాకుండా అధిక ధరలకు అమ్ముతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ దీనిపై దృష్టి సారించారు.
జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు కూరగాయల మార్కెట్లలో సామాన్య వ్యక్తిలా మారువేషంలో వెళ్లి ధరలను తెలుసుకున్నారు. ఇతర కొనుగోలు దారుల నుంచి ధరలకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల 5 ఎక్కువ అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో ఎక్కడ తప్పు జరుగుతోందో అధికారులతో సమావేశమై ధరలు నియంత్రణ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మారువేషంలో వచ్చింది జాయింట్ కలెక్టర్ అని తెలుసుకొని కొంత మంది వ్యాపారులు అవాక్కయ్యారు.
సినిమాల్లోనే ఇప్పటి వరకూ మోసాలను వెలుగులోకి తెచ్చేందుకు అధికారులు మారు వేషం వెయ్యడాన్ని చూశాం. కానీ ఇప్పుడు నిజ జీవితంలోనూ విజయనగరం జాయింట్ కలెక్టర్…మారు వేషంలో కూరగాయల మార్కెట్లను తనిఖీ చేశారంటూ మాట్లాడుకుంటున్నారు స్థానికులు. ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధులు కూడా ఇలాగే తనిఖీలు చేస్తే మోసం చేసేవారికి భయం ఉంటుందంటున్నారు.