బైక్ ను ఢీకొట్టిన జేసీబీ..ముగ్గురు మృతి

బైక్ ను ఢీకొట్టిన జేసీబీ..ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లా : మొయినాబాద్‌ లో విషాదం చోటుచేసుకుంది. మొయినాబాద్‌ మండలం నక్కలపల్లి దగ్గర బైక్ ను జేసీబీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. చనిపోయినవారంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. ప్రమాదంలో మరో వ్యక్తి జేసీబీ కింద చిక్కుకున్నట్లు సమాచారం. చిక్కుకున్న వ్యక్తిని బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.