హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టి.జీవన్ రెడ్డి ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు కోర్టుకు వెళ్లాయని, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూల్ చేసుకోవచ్చని కోర్టు ఆదేశాలిచ్చిందని గుర్తుచేశారు.
కాలేజీలకు రీయింబర్స్ మెంట్ చేయకుండా విద్యార్థులకు ఇస్తామంటే ఎలా నమ్మాలన్నారు. పేదలంటే సీఎం రేవంత్కు ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. రైతు భరోసా, రుణమాఫీ రెండు విడతలు ఎగ్గొట్టారని మండిపడ్డారు. రేవంత్రెడ్డికి హైడ్రా, ఫోర్త్సిటీ తప్ప.. మిగతా సమస్యలేవీ కనిపించడం లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించారని, అది అమలవుతున్నదో.. లేదో తెలుసుకోవాలని సూచించారు.
