
హైదరాబాద్, వెలుగు: ఓయూలోని ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో, మోడల్ కెరియర్ సెంటర్లో గురువారం మినీ జాబ్ మేళా జరుగనుంది. సెంటర్ డిప్యూటీ చీఫ్ ఆఫీసర్ టి.రాము మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రిలయన్స్ జియో, పేటీఎం, కాలిట్ హెచ్ఆర్, ఇన్నోవ్ సోర్స్ సర్వీసెస్, శుభ గృహ ప్రాజెక్ట్స్, పేరం గ్రూప్ ప్రైవేట్ కంపెనీల్లో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసేందుకు సుమారు 400 ఉద్యోగాలకు ఎంపిక కోసం మేళా నిర్వహిస్తున్నామన్నారు. 19 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ, ఎంబీఏ తదితర విద్యార్హతలున్నవారు పాల్గొనవచ్చని.. ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ట్రైనీస్, ప్రమోటర్స్, మార్కెటింగ్ మేనేజర్స్ ఉద్యోగాలున్నాయన్నారు. రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనాలు ఉంటాయని.. ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్ ఎదురుగా ఉన్న ఆఫీసులో ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని సూచించారు.
For More News..