మెరిట్​ ఉన్నా జాబ్​లు ఇస్తలేరు

మెరిట్​ ఉన్నా జాబ్​లు ఇస్తలేరు

ఫారెస్ట్​ బీట్ ఆఫీసర్​పోస్టుల భర్తీలో రూల్​6ఏ పాటించని ఆఫీసర్లు

హైకోర్టు ఆదేశించినా స్పందించని టీఎస్​పీఎస్​సీ

మహబూబ్​నగర్​, వెలుగు:  ఫారెస్ట్​ బీట్ ఆఫీసర్​ పోస్టుల భర్తీలో టీఎస్​పీఎస్​సీ ఆఫీసర్లు రూల్​6ఏ పాటించకపోవడంతో మెరిట్​క్యాండిడేట్లు లాస్​ అవుతున్నారు. జాబ్​లో చేరకుండా వెళ్లిపోయిన వారి కారణంగా మిగిలిన 324 పోస్టులను తర్వాతి క్యాండిడేట్లతో భర్తీ చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలను కూడా పాటించకపోవడంతో అభ్యర్థులు ఏడాదిన్నర కారణంగా ఎదురుచూస్తున్నారు.

2017 లో నోటిఫికేషన్​..

టీఎస్​పీఎస్​సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీ కోసం 2017లో నోటిఫికేషన్ నంబర్​: 48/2017 జారీ చేసింది. మొత్తం1857 పోస్టులకు వేలాది మంది నిరుద్యోగులు పోటీపడి, పరీక్షలు రాశారు. 2019లో రిజల్ట్స్​ విడుదలయ్యాయి. ఈ పోస్టులకు 1:2 రేషియోలో క్యాండిడేటర్లను ఇంటర్వ్యూలకు పిలిచారు. మొదట ఉద్యోగం పొందినవారిలో  324 మంది జాబ్​లో జాయిన్​కాలేదు. రూల్​ ప్రకారం మెరిట్ లిస్ట్​లో ఉన్న క్యాండెంట్లకు పిలిచి, ఉద్యోగాలివ్వాలి. కానీ నేటికీ పిలవకపోవడంతో ఆ పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి.

హైకోర్టు ఆదేశించినా..

తమను ఇంటర్వ్యూకు పిలిచేలా టీఎస్​పీఎస్​సీని ఆదేశించాలని కోరుతూ పలువురు క్యాండిడేట్లు హైకోర్ట్​ను ఆశ్రయించారు. దీంతో మెరిట్ ప్రకారం అర్హులైనవారిని పిలిచి, పోస్టులు భర్తీచేయాలని  టీఎస్​పీఎస్​సీని హైకోర్టు ఆదేశించింది. ఇది జరిగిన ఏడాది దాటుతున్నా టీఎస్​పీఎస్​సీ ఇంటర్వ్యూలు నిర్వహించలేదు. మొదటి సర్టిఫికెట్ వెరిఫికేషన్ లిస్ట్ లో ఉన్న  2,500 మంది క్యాండిడేట్లు పూర్తి అర్హతలతో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. ఒక్క ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోనే సుమారు 100 మందికి పైగా అభ్యర్థులు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. ఆఫీసర్లు  రూల్ 6 A పాటించి ఉంటే తాము ఈపాటికి ఉద్యోగాల్లో ఉండేవాళ్లమని చెబుతున్నారు. ఇప్పటికైనా టీఎస్​పీఎస్​సీ ఆఫీసర్లు స్పందించి, మెరిట్​లిస్టు ప్రకారం పోస్టులు భర్తీ చేయాలని క్యాండిడేట్లు డిమాండ్​ చేస్తున్నారు.

మెరిట్​లిస్టులో ఉన్నా..

కష్టపడి చదివి ఫారెస్ట్​ బీట్​ ఆఫీసర్​ ఉద్యోగానికి అన్ని అర్హతలు సాధించాను. మెరిట్​ లిస్ట్​లో ఉన్నాను. మిగిలిన పోస్టులు భర్తీ చేస్తే నాకు ఉద్యోగం వస్తుంది. కానీ టీఎస్​పీఎస్​సీ ఆఫీసర్లు మాత్రం నాలాంటి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.

–ఆనంద్​కుమార్​, మెరిట్​ స్టూడెంట్​, కోస్గి. మహబూబ్​నగర్​ జిల్లా

For More News..

ఎమ్మెల్సీ క్యాండిడేట్​పై టీఆర్ఎస్​ సస్పెన్స్

కేసీఆర్ అవినీతిపై ఎంక్వైరీ!