కరెంట్ టాపిక్... బిట్ బ్యాంక్ 

 కరెంట్ టాపిక్... బిట్ బ్యాంక్ 
  • ప్రముఖ తెలంగాణ నాయకుడు మాడపాటి హన్మంతరావుకు ఆంధ్ర పితామహుడు అనే బిరుదు ఉంది.
  • హైదరాబాద్​ సంస్థానం పాఠశాలల్లో ప్రతిరోజు ఉదయం తరగుతులు  ప్రారంభం కావడానికి ముందు నిజాం రాజును కీర్తిస్తూ ప్రార్థనా గీతం పాడేవారు.
  • హైదరాబాద్​ సంస్థానానికి వెలుపల మాడపాటి హన్మంతరావు, వామన్ రాఘవేంద్రరావు సమావేశాలు జరిపేవారు. 
  • 1938లో దసరా పండుగ నాడు ఉస్మానియా విశ్వవిద్యాలయం బి హాస్టల్​ విద్యార్థులు వందేమాతరం గీతాన్ని పాడారు. 
  • ఉస్మానియా విశ్వవిద్యాలయం హాస్టల్​ విద్యార్థులు 1938  నవంబర్​ 28న వందేమాతరం ఉద్యమం లేవదీశారు. 
  • వందేమాతరం ఉద్యమం నేపథ్యంలో 1938 నవంబర్​ 29 ఉస్మానియా విశ్వవిద్యాలయం హాస్టల్​ విద్యార్థులను కళాశాల నుంచి బహిష్కరించారు. 
  • వందేమాతరం ఉద్యమంలో భాగంగా హైదరాబాద్​ సంస్థానంలో 1938 నవంబర్​ 29 నుంచి డిసెంబర్​ 10 వరకు విద్యార్థులు సమ్మె నిర్వహించారు. 
  • వందేమాతర ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించిన విద్యార్థులకు నాగపూర్​ విశ్వవిద్యాలయం అడ్మిషన్లు కల్పించింది.
  • వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను అభినందిస్తూ ప్రముఖ జాతీయ నాయకులు జవహర్​లాల్​ నెహ్రూ, సుభాష్​ చంద్రబోస్​ లేఖలు పంపారు. 
  • వందేమాతరం గీతాన్ని పాడుకునే హక్కు భారతీయ విద్యార్థులందరికీ ఉందని మహాత్మా గాంధీ ప్రకటించారు. వందేమాతరం ఉద్యమంలో  విద్యార్థి నాయకులు పీవీ నరసింహారావు, నూకల రామచంద్రారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, టి.హయగ్రీవాచారి, డి.వెంకటేశ్వర్లు, అచ్యుతరెడ్డి, సర్వేదేవభట్ట రామనాథం, మర్రి చెన్నారెడ్డి చురుగ్గా పాల్గొన్నారు. 
  • తెలంగాణలో కమ్యూనిస్టు విద్యార్థి ఉద్యమం ఆవిర్భావానికి ముఖ్దూం మొయినుద్దీన్, ఓంకార్​ ప్రసాద్, జవ్వాద్​ కృషి చేశారు. 
  • 1943లో ట్రేడ్​ యూనియన్​ ఉద్యమాన్ని ముఖ్దూం మొయినుద్దీన్​ నిర్మించారు. 
  • హైదరాబాద్​ నగరంలో సోషలిస్టు భావాలు కలిగిన వారు కలిసి కామ్రేడ్స్​ అసోసియేషన్​ అనే ప్రజా సంఘం ఏర్పాటు చేశారు.
  • భారత ప్రభుత్వ సైనిక చర్య సమయంలో కామ్రేడ్స్​ అసోసియేషన్​ నాయకులు ఆజాద్​ హైదరాబాద్​కు  పిలుపు ఇచ్చారు. 
  • ఎల్లా ప్రగడ సీతాకుమారి, అనంత లక్ష్మీదేవి, గద్వాల మహారాణి ఆది లక్ష్మీదేవి కలసి 1935లో నిజామాంధ్ర యువతీ మండలి సంఘం ఏర్పాటు చేశారు. 
  • నిజాం ఆంధ్ర యువతీ మండలికి తొలి అధ్యక్షురాలు గద్వాల మహారాణి ఆది లక్ష్మీదేవి.
  • నిజాం ఆంధ్ర యువతీ మండలి కార్యాలయం హైదరాబాద్​లోని బొగ్గులకుంట రెడ్డి హాస్టల్​లో ఉండేది. 
  • నిజాం ఆంధ్ర యువతీ మండలి భవనాన్ని 1952లో స్థాపించారు. 
  • నిజాం ఆంధ్ర యువతీ మండలి శిశువికాస్​ విహార్​ను 1955లో నెలకొల్పింది.
  • తెలంగాణ తొలి తరం దళిత ఉద్యమకారుల్లో అగ్రగణ్యుడు భాగ్యరెడ్డి వర్మ.
  • అంబేద్కర్ కంటే ముందే భారతదేశ అభ్యున్నతి కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ. 
  • భారతదేశంలో అణగారిన, అంటరాని పంచ మ కులాలుగా గుర్తించిన వారిలో చైతన్యం తీసుకురావడానికి భాగ్యరెడ్డి వర్మ 1906లో జగన్​ మిత్ర మండలిని స్థాపించాడు. 
  • భాగ్యరెడ్డి వర్మ మొదటిసారిగా హైదరాబాద్​లోని ఇసామియా బజార్​లో అంటరాని వర్గాల కోసం 1910లో పాఠశాలను స్థాపించాడు. 
  • ఆది హిందూ పాఠశాలల నిర్వహణకు దక్కన్​ హ్యూమనేటేరియన్ లీగ్, జీవరక్ష జ్ఞాన ప్రచార మండలి సహకారం అందించింది.
  • ఆది హిందూ పాఠశాల నిర్వహణను నిజాం ప్రభుత్వం 1934లో స్వీకరించింది.
  • ఆది హిందువుల అభివృద్ధి కోసం భాగ్యరెడ్డి వర్మ 1911లో హిందూ సోషల్​ సర్వీస్​ లీగ్​ స్థాపించారు.
  • ఆది హిందువులను సబ్బండ వర్ణాల వారితో కలిపి సహపంక్తి భోజనాలు చేయించి కుల నిర్మూలనకు, అంటరానితనం తొలగింపు కోసం భాగ్యరెడ్డి వర్మ కృషి చేశారు. 
  • 1917లో విజయవాడలో ప్రథమ ఆంధ్ర ఆది హిందూ సదస్సుకు భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షత వహించాడు. 
  • 1917లో విజయవాడలో జరిగిన ఆంధ్ర ఆది హిందూ సదస్సులో భాగ్యరెడ్డి వర్మ ప్రసంగానికి ప్రేరణ పొందిన ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి అనే నవలను రచించాడు.  
  • 1917లో కలకత్తాలో జరిగిన అఖిల భారత హిందూ సంస్కరణ సభలో భాగ్యరెడ్డి వర్మ ప్రసంగానికి గాంధీ ఆకర్షితులయ్యారు. 
  • దళిత ఉపకులాల మధ్య సమన్వయం కోసం 1919లో భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ సమ్మేళనాన్ని  నిర్వహించారు. 
  • భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన ఆది హిందూ లీగ్​ 1921 నుంచి 1924 వరకు వరుసగా సమావేశాలు జరిపింది. 
  •