రెకమండేషన్ తో కొలువులు రావు.. స్కిల్స్ ఉంటేనే జాబ్స్ : కిషన్ రెడ్డి

రెకమండేషన్ తో కొలువులు రావు..  స్కిల్స్ ఉంటేనే జాబ్స్ :   కిషన్ రెడ్డి

హైదరాబాద్ : రెకమెండేషన్ ద్వారా ఉద్యోగాలు రావని, స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు వస్తాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇందిరా  పార్క్ లో  "రోజ్ గార్ మేళా"  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. పలువురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. 

‘9 ఏళ్ళు గా  ప్రధాన మంత్రి దేశంలోని అనేక వ్యవస్థల్లో మార్పులు తీసుకొస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణలకు అనుగుణంగా యువతను తీర్చి దిద్దే లా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. యువత లో స్కిల్స్ పెరిగేలా  కార్యక్రమాలు చేస్తున్నాం. రాబోయే 25 సంవత్సరాలలో దేశాభివృద్ధిలో  యువత కీలక కీలక పాత్ర పోషించనుంది.10 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ద్వారా ఉద్యోగాలివ్వాలని  నిర్ణయం తీసుకున్న  ప్రధాన మంత్రి కి కృతజ్ఞతలు’ అని కిషన్ రెడ్డి తెలిపారు.