గద్వాల, వెలుగు : జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల పరిధిలోని ఇందువాసి గ్రామ పంచాయతీ సెక్రటరీ గొల్ల శేఖర్ ను శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సస్పెండ్ చేశారు. గ్రామ ప్రజలు ప్రజావాణిలో సెక్రటరీ అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో నిధుల అక్రమ వినియోగంపై కలెక్టర్ ఎంక్వయిరీ చేయించారు. డీపీఓ విచారణలో సెక్రటరీ అవినీతి పాల్పడినట్టు నివేదిక రావడంతో కలెక్టర్ సస్పెండ్ చేశారు.
