హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డా.. బీజేపీ నేతల ఘన స్వాగతం

హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డా..  బీజేపీ నేతల ఘన స్వాగతం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి తదితరులు ఘన స్వాగతం పలికారు. నోవాటెల్ హోటల్ కి వెళ్లనున్న ఆయన... మాజీ ఎమ్మెల్సీ ప్రొ.నాగేశ్వర్ , పద్మశ్రీ శంకర్ జయంత్ నివాసాలకు వెళ్లనున్నట్లు సమాచారం.

జూన్ 25 న  నాగర్ కర్నూల్ లో జరగనున్న నవసంకల్ప సభకు నడ్డా హాజరుకానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై నడ్డా ఏం మాట్లాడతారోనని ఉత్కంఠ నెలకొంది.  పార్టీలో నెలకొన్న పరిస్థితులు, రానున్న అసెంబ్లీ ఎన్నికలు, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి తదితర అంశాలపై నేతలతో చర్చించనున్నారు.