సీసీసీ నుంచి పర్యవేక్షణ.. ప్రశాంతంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్

సీసీసీ నుంచి పర్యవేక్షణ.. ప్రశాంతంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా కొనసాగేలా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు కూడా డ్రోన్లను వినియోగించారు. 900 సీసీటీవీ కెమెరాలతో  కమాండ్​ కంట్రోల్​ సెంటర్​ నుంచి పోలింగ్‌‌‌‌ స్టేషన్లను సీపీ సజ్జనార్ మానిటరింగ్ చేశారు. రహమత్​నగర్​లోని పోలింగ్ బూత్ వద్ద డాగ్స్ స్క్వాడ్, బాంబ్​స్క్వాడ్  బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఎన్నికల సామగ్రి, పోలింగ్ పరిసరాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని నిర్ధారించుకునేందుకు ఈ బృందాలు విస్తృతంగా తనిఖీలు  చేపట్టాయి.