మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో మాగంటి అంత్యక్రియలు

మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో మాగంటి అంత్యక్రియలు

అనారోగ్యంతో కన్నుమూసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భౌతిక కాయాన్ని  మాదాపూర్ కావూరి హిల్స్ లోని తన నివాసానికి తరలించారు. జూన్ 8న  సాయంత్రం 4 గంటలకు మహా ప్రస్థానంలో మాగంటి అంత్యక్రియలు జరగనున్నాయి.  ప్రభుత్వ అధికార లాంచనాలతో మాగంటి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.కాసేపట్లో కేసీఆర్ మాగంటి ఇంటికి వెళ్లి భౌతిక కాయానికి నివాళి అర్పించనున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీశ్ రావు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మాగంటి గోపినాథ్ గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం కూడా ఐఏజీ ఆస్పత్రిలో చేరారు. అప్పట్లో డయాలసిస్ చేపించుకున్నారు. మళ్లీ గుండెపోటు రావడంతో జూన్ 5న కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. గత మూడు రోజులుగా వెంటిలెటర్ పైనే మాగంటికి చికిత్స అందించారు డాక్టర్లు.  ఆరోగ్యం తీవ్రంగా విషమించడంతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. 

గోపి నాథ్ మృతి పట్ల బీఆర్ఎస్ నేతలు,పలువురు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.మాగంటి గోపినాథ్  జూబ్లీహిల్స్ నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 లో టీడీపీ నుంచి,2018,2023లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.