
- పారామెడికల్, నాన్ పారామెడికల్ అభ్యర్థులే అర్హులు
- మొత్తం 3,153 ఖాళీలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: వెస్ట్ మారేడ్పల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కాలేజీలో నేడు ఉదయం 9.30 గంటల నుంచి ఒకేషనల్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థుల కోసం అప్రెంటిషిప్, జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఒడ్డన్న ఆదివారం తెలిపారు.
ఈ మేళాలో పారామెడికల్, నాన్-పారామెడికల్ రంగాలకు సంబంధించిన164 కంపెనీలు పాల్గొంటున్నాయని, మొత్తం 3,153 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. మూడేండ్లలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనడానికి అర్హులన్నారు. పూర్తి వివరాలకు 9848781805 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.