జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ.. ఫ్యాన్స్ కు దిమ్మదిరిగే వార్త

జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ.. ఫ్యాన్స్ కు దిమ్మదిరిగే వార్త

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు దిమ్మదిరిగే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తెలుగు పరిశ్రమ కీర్తిని ఖండాంతరాలు దాటించేశాడు రాజమౌళి. ఈ సినిమాలో రాంచరణ్, ఎన్టీఆర్ ల నటనకు సినీ అభిమానులు ఫిదా అయ్యారు. అయితే, ఇప్పుడు  బాలీవుడ్ కన్ను యంగ్ టైగర్ పై పడినట్టు తెలుస్తోంది. తాజాగా వార్తల్లో నిలిచిన ఓ వార్త వింటే ఇదే విషయం స్పష్టమవుతోంది. 

సినీ పరిశ్రమలో ప్రయోగాలకు పెద్ద పీట వేస్తున్న దర్శక నిర్మాతలు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. సంబంధం లేని సినిమాల్లోని పాత్రలను, హీరోలను  కలుపుతూ కొత్తగా యూనివర్స్ అంటూ ప్రేక్షకుల్లో భారీ అంచనాలకు తెరతీస్తున్నారు. బాలీవుడ్ కూడా ఇదే బాట పట్టింది. టైగర్ ష్రాఫ్ నటించిన వార్, షారుఖ్ ఖాన్ పఠాన్, సల్మాన్ ఖాన్ టైగైర్ సినిమాలను కలిపి ఓ ప్రయోగం చేయబోతోంది. ఈ భారీ ప్రాజెక్టులో జూనియర్ ఎన్టీఆర్ ను భాగం చేయాలని చూస్తోందట. ఈ విషయాన్ని తరణ్ ఆదర్శ్ అనే సినిమా క్రిటిక్ పోస్ట్ చేశాడు. బాలీవుడ్ స్టార్ హ్రితిక్ రోషన్ తో పాటుగా యంగ్ టైగర్ ఈ సినిమాలో కనిపిస్తాడట. అయితే, వీరి కాంబినేషన్ ను ఎన్టీఆర్ వర్సెస్ హ్రితిక్ రోషన్ గా మారిస్తే ఎలా ఉంటుందనే దానిపై కొత్తగా ఈ ప్రాజెక్టు పగ్గాలు చేపట్టిన దర్శకుడు అయాన్ ముఖర్జీ ఆలోచిస్తున్నాడట. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ విడుదల కావలసి ఉంది. తన దగ్గరకు వచ్చిన ఎలాంటి పాత్రకైనా పూర్తి న్యాయం చేసే ఎన్టీఆర్ బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుతాడంటూ అప్పుడే  ఫ్యాన్స్ రచ్చ మొదలుపెట్టారు.