ఐపీఓకు జూనిపర్ గ్రీన్ ఎనర్జీ.. రూ. 3,000 కోట్లను సమీకరణకు సెబీకి డాక్యుమెంట్లు

ఐపీఓకు జూనిపర్ గ్రీన్ ఎనర్జీ.. రూ. 3,000 కోట్లను సమీకరణకు సెబీకి డాక్యుమెంట్లు

న్యూఢిల్లీ: పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిదారు జూనిపర్​ గ్రీన్ ఎనర్జీ  ఐపీఓ  ద్వారా రూ. 3,000 కోట్లను సమీకరించేందుకు సెబీకి డాక్యుమెంట్లు అందజేసింది.  ఐపీఓ పూర్తిగా ఫ్రెష్​ ఇష్యూ విధానంలో ఉంటుంది. ఆఫర్ -ఫర్ -సేల్ భాగం ఉండదు. కంపెనీ ప్రీ-ఐపీఓ రౌండ్‌‌‌‌‌‌‌‌లో దాదాపు రూ. 600 కోట్లు సేకరించాలని చూస్తోంది. ప్రీ- ఐపీఓ రౌండ్ జరిగితే, తాజా ఇష్యూ పరిమాణం తదనుగుణంగా తగ్గుతుంది. 

కొత్త ఇష్యూ ద్వారా వచ్చే రూ.1,157.7 కోట్ల నిధులను అప్పులు తీర్చడానికి, పెట్టుబడి పెట్టడానికి ఉపయోగిస్తారు.  జూనిపర్​ గ్రీన్ ఎనర్జీ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తుంది. గురుగ్రామ్ ఆధారిత కంపెనీ డిసెంబర్ 31, 2024 నాటికి మొత్తం సామర్థ్యం పరంగా భారతదేశంలోని టాప్ 10 పునరుత్పాదక స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులలో ఒకటిగా నిలిచింది. 

2018లో కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి, కంపెనీ తన పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియోను 48 ప్రాజెక్టులలో 7,898.45 మెగావాట్లకు విస్తరించింది. దీని ప్రాజెక్టులు గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్,  మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లలో ఉన్నాయి.   ఇదిలా ఉంటే, హర్యానాకు చెందిన అమీర్ చంద్ జగదీష్ కుమార్ (ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్) లిమిటెడ్​కు కూడా ఐపీఓ కోసం సెబీకి డాక్యుమెంట్లను సమర్పించింది. 

ఇది రూ.550 కోట్లను సేకరించడానికి అనుమతి కోరింది. ఇది కూడా ఇది పూర్తిగా ఫ్రెష్​ఇష్యూ. కంపెనీ ప్రీ-ఐపీఓ రౌండ్‌‌‌‌‌‌‌‌లో దాదాపు రూ.50 కోట్లు సేకరించాలని చూస్తోంది. ప్రీ-ఐపీఓ రౌండ్ జరిగితే, కొత్త ఇష్యూ పరిమాణం తదనుగుణంగా తగ్గుతుంది. అమీర్ చంద్ జగదీష్ కుమార్ (ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్) లిమిటెడ్ బాస్మతి బియ్యంను ఎగుమతి చేస్తుంది.