జూరాల ప్రాజెక్టుకు ఏం కాదు : ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

జూరాల ప్రాజెక్టుకు ఏం కాదు :  ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
  • గద్వాల టౌన్, వెలుగు: జూరాల ప్రాజెక్టుకు వంద ఏండ్లు అయినా ఏమీ కాదని 

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్  ఆఫీస్​లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టులోకి వెళ్లడానికి కూడా పరిస్థితి అనుకూలించడం లేదని మాజీ ఎమ్మెల్యే భరత సింహారెడ్డి మాట్లాడడం తగదన్నారు. జూరాల ప్రాజెక్టులో కొంత సమస్య ఉన్నమాట వాస్తవమేనని కానీ, ప్రాజెక్టు కూలిపోయేంత పరిస్థితి లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. 

ప్రజల్లో అపోహలు సృష్టించి భయభ్రాంతులకు గురి చేయడం మానుకోవాలన్నారు. సోమవారం జూరాల ప్రాజెక్టు వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితిని మీడియాకు చూపిస్తామని తెలిపారు. అభివృద్ధి కోసమే అధికార పార్టీకి సపోర్ట్  చేస్తున్నానని చెప్పారు. తన పార్టీ ఏదో చెప్పాలని అడిగే వారికి  ‘నాది అభివృద్ధి పార్టీ’ అనేదే సమాధానం అని చెప్పారు. ప్రతాప్ గౌడ్, సుభాన్, రాజశేఖర్  
పాల్గొన్నారు.