భారత 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం

భారత 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం

హైదరాబాద్: భారత 53వ ప్రధాన న్యాయమూర్తి (CJI)గా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం (నవంబర్ 24) రాష్ట్రపతి భవన్‎లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జస్టిస్ సూర్యకాంత్ సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీజేఐ బీఆర్ గవాయ్, ప్రధాని మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు తదితరులు హాజరయ్యారు. 

జస్టిస్ బీఆర్ గవాయ్ ఆదివారం (నవంబర్ 23) సాయంత్రం సీజేఐగా పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. గవాయ్ స్థానంలో జస్టిస్ సూర్యకాంత్2025, అక్టోబర్ 30న సీజేఐగా నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో 15 నెలలపాటు కొనసాగనున్నారు. 2027 ఫిబ్రవరి 9న ఆయన రిటైర్ కానున్నారు.

జస్టిస్ సూర్యకాంత్ హర్యానాలోని హిసార్ జిల్లాలో 1962 ఫిబ్రవరి 10న ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. హిసార్‎లో 1984లో లాయర్‎గా ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఆయన అంచెలంచెలుగా సీజేఐ స్థాయికి ఎదిగారు. సుప్రీంకోర్టు జడ్జిగా తన కెరీర్‎లో ఆయన చరిత్రాత్మకమైన తీర్పులు ఇచ్చారు. ఆర్టికల్ 370 రద్దు తీర్పును ఇచ్చిన రాజ్యాంగ  ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్​సభ్యుడిగా ఉన్నారు.