జూబ్లీహిల్స్ మైనర్ కేసులో జువైనల్ బోర్డు కీలక తీర్పు

జూబ్లీహిల్స్ మైనర్ కేసులో జువైనల్ బోర్డు కీలక తీర్పు

జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అఘాయిత్యం కేసులో జువైనల్ జస్టిస్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు మైనర్లలో నలుగురిని మేజర్లుగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఐదో నిందితుడైన ఎమ్మెల్యే కొడుకును మాత్రం మైనర్గా ప్రకటిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. మేజర్లుగా పరిగణించిన నలుగురిని సాధారణ నిందితుల్లాగే విచారించవచ్చని తేల్చి చెప్పింది. 

ఈ ఏడాది మే 28న జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ వద్ద బాలికను కారులో ఎక్కించుకున్న ఆరుగురు నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. కారులో నగరమంతా తిరుగుతూ దారుణానికి పాల్పడ్డారు. వారిలో ఒకరు ఎమ్మెల్యే కొడుకు కావడంతో ఈ ఘటన పెను దుమారం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేయగా.. ఐదుగురు మైనర్లు కావడంతో జువైనల్ హోంకు, ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్ ను జైలుకు పంపారు. జులైలో జువైనల్ జస్టిస్ బోర్డు నలుగురు మైనర్లకు బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మెల్యే కొడుకు హైకోర్టును ఆశ్రయించడంతో బెయిల్ మంజూరు చేసింది. ఆగస్టులో ప్రధాన నిందితుడైన సాదుద్దీన్ కు న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.