తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్లోని జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (అటానమస్) కాలేజీలో బీటెక్ ఫస్టియర్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కు షాలిని విద్యాసంస్థల అధినేత జువ్వాడి సాగర్ రావు ఆదివారం స్కాలర్షిప్ చెక్కులు అందజేశారు. మొత్తం 16 మంది విద్యార్థులకు రూ.18 వేల చొప్పున అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలేజీలో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థికి ఏటా రూ.18వేల చొప్పున నాలుగేండ్లకు మొత్తం రూ.72వేల స్కాలర్షిప్ అందజేయనున్నట్లు తెలిపారు. విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు షాలిని ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఈ సహాయాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. పలు విద్యాసంస్థలు భారీ వ్యయంతో ప్రచారం చేస్తూ అడ్మిషన్లు చేయిస్తున్నాయని, కానీ తాము ఎలాంటి ప్రచార ఆర్భాటాలకు వెళ్లకుండా ఆ వ్యయాన్ని విద్యార్థుల సంక్షేమానికే వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు.
