కొత్త పార్లమెంట్ బిల్డింగ్​కు అంబేద్కర్​ పేరు పెట్టాలె

కొత్త పార్లమెంట్ బిల్డింగ్​కు అంబేద్కర్​ పేరు పెట్టాలె
  • అఖిల భారత షెడ్యూల్డ్ కులాల, తెగల సంఘాల సమాఖ్య 

హైదరాబాద్, వెలుగు: కొత్త పార్లమెంట్ బిల్డింగుకు డా.బి.ఆర్.అంబేద్కర్ పార్లమెంటరీ హౌజ్ అని పేరు పెట్టి, విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిల భారత షెడ్యూల్డ్ కులాల, తెగల సంఘాల సమాఖ్య స్టేట్ ప్రెసిడెంట్ కె.మహేశ్వర్​రాజ్ పార్లమెంట్ మెంబర్, వీసీకే పార్టీ ఫౌండర్ డా.తొల్కప్పియన్ తిరుమవలవన్​కి లెటర్​రాశారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో నోబుల్ అంశాన్ని లేవనెత్తాలని కోరారు.  కొత్త పార్లమెంట్ భవనానికి 2020 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేయగా, ఈ నెల 11న జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు. ఈ ఏడాది అక్టోబర్ లో పార్లమెంట్ ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే బిల్డింగ్ పేరు విషయమై ప్రధాని నరేంద్ర మోడీకి అభ్యర్థన పెట్టుకున్నట్లు లెటర్​లో పేర్కొన్నారు.