న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలోని వృద్ధులకు రూ.3 వేల పెన్షన్ ఇస్తూ.. తెలంగాణలో ఒక్కో కుటుంబంపై సీఎం కేసీఆర్ రూ.5 లక్షల అప్పును మోపారని ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారన్నారన్నారు.
గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్కు ఓటేస్తే.. అది బీఆర్ఎస్కే వెళ్తుందన్నారు. గతంలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరారని ఆయన గుర్తుచేశారు. అందుకే ప్రజలు ఆలోచించి, అప్రమత్తతో ఓటు వేయాలని కోరారు.