ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేస్తరు.. టాయిలెట్స్ కట్టించరా?:కేఏపాల్

ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేస్తరు.. టాయిలెట్స్ కట్టించరా?:కేఏపాల్

ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు కానీ..కళాశాలల్లో విద్యార్థులకు టాయిలెట్స్, కనీస సౌకర్యాలు కల్పించలేరా అని  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. ఇవాళ ఆయన సరూర్ నగర్  ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం మీడియాతో మాట్లాడిన కేఏ పాల్.. సరూర్ నగర్ జూనియర్ కళాశాలలో సుమారు 800 మంది విద్యార్థులు చదవుతున్నారని.. కళాశాలలో కేవలం ఒకే ఒక్క గర్ల్స్ టాయిలెట్ తో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుసుకున్నామని  తెలిపారు. విషయం తెలుసుకొని ఈ రోజు కళాశాలను పరిశీలించామన్నారు. కళాశాలలో నెలకొన్న దుస్థితిపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఆకుల శ్రీవాణీలపై పాల్ మండిపడ్డారు. వారం రోజులలో టాయిలెట్స్ నిర్మాణం చేయకపోతే తన ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తానని పాల్ వెల్లడించారు.