స్వర్గానికి యముడు.. ముగిసిన కైకాల అంత్యక్రియలు

స్వర్గానికి యముడు.. ముగిసిన కైకాల అంత్యక్రియలు

ప్రముఖుల నివాళులు, అభిమానుల అశ్రు నయనాల నడుమ కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‭లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. కైకాల పార్థివదేహాన్ని ఫిలింనగర్‭లోని ఇంటి నుంచి మహాప్రస్థానంకు అంతిమయాత్రగా తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులు, కొంత మంది ప్రముఖులను మాత్రమే లోపలికి అనుమతించి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు గౌరవ వందనం తర్వాత గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి నివాళులర్పించారు. కైకాల పెద్ద ​కుమారుడు లక్ష్మీ నారాయణ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తర్వాత మిగిలిన కార్యక్రమాలు నిర్వహించి కైకాలకు తుది వీడ్కోలు పలికారు.

నిన్నటి నుంచి పలువురు నటులు, రాజకీయ నాయకులతో పాటు అభిమానులు సందర్శించి నివాళులు అర్పించారు. కైకాల చివరి చూపు కోసం వేలాది మంది అభిమానులు అంతిమయాత్రకు తరలివచ్చారు.