
మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. సుమారు 45 నిమిషాల పాటు ఆయనను కమిషన్ విచారించింది. కాళేశ్వరం నిర్మాణంలో అప్పటి నీటిపారుదల మంత్రిగా మొదటి నుంచి ఆయన ఉన్నందున నిర్మాణానికి సంబంధించిన అన్ని విషయాలను కమిషన్ ఆయనను అడిగినట్లు తెలుస్తోంది.
కాళేశ్వరం డిజైన్లు, బ్యారేజీల ఎంపికపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. అదే విధంగా నిధుల సమీకరణపైనా ప్రశ్నలు వేసింది. సుమారు 45 నిమిషాల పాటు సమగ్రంగా ప్రాజెక్టు గురించి ప్రశ్నించింది కమిషన్.
కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. మహారాష్ట్ర, సీడబ్ల్యూసీ అభ్యంతరాల వల్లనే తుమ్మిడిహెట్టి నుంచి ప్రాజెక్టును మార్చినట్లు చెప్పారు. ప్రాజెక్టు టెక్నికల్ అంశాల్లో ఇంజినీర్లదే కీలక నిర్ణయమని కమిషన్ కు చెప్పారు. రాజకీయ నాయకులుగా తాము నిర్ణయం తీసుకోలేమని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం కేబినెట్ నిర్ణయం మేరకే జరిగిందని ఆయన కమిషన్ కు చెప్పారు.
కమిషన్ కు హాజరైన హరీష్ రావు మరికాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు.