కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఉంది.. రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మిస్తున్నారు

 కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఉంది.. రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మిస్తున్నారు
  • లోక్ సభలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్న
  • కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాతపూర్వక సమాధానం 

న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర జల శక్తి శాఖ సలహా మండలి అనుమతి వుందని ఆ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో కట్టుకుంటోదని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్వ పరాల గురించి లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 
కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే తన సొంత వనరుల ద్వారా నిర్మించిందని, ఇప్పటివరకు 83.7 శాతం  ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యాయని వివరించారు. ఈ ప్రాజెక్టు కింద 18లక్షల 25వేల 700 ఎకరాలకు కొత్తగా సాగునీరు, మరో 18లక్షల 82వేల 970 ఎకరాల స్తిరీకరణ జరుగుతుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 240 టీఎంసీల  నీటిని ఎత్తిపోసి సరఫరా చేసేందుకు నిర్మిస్తున్నారని వివరించారు. ఈ ప్రాజెక్టు కింద కరీంనగర్ , రాజన్నసిరిసిల్ల, మెదక్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సంగారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల్ , కామారెడ్డి, నిర్మల్, మేడ్చేల్, పెద్ద పల్లి జిల్లాల్లో భూములు కొత్తగా సాగులోకి తెచ్చే ప్రతిపాదనతో ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, ప్రాజెక్టుకు ఇప్పటివరకు 80 వేల 321.57 కోట్లు ఖర్చు అయిందని తెలిపారు. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు సమకూర్చాయని పేర్కొన్నారు. 

For more news :

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఆఫీస్ రిటర్న్ ఇప్పట్లో లేనట్లే..

సర్పంచ్ పదవికి వేలం పాట

పంటకు నిప్పు పెట్టిన రైతన్న