శ్రీనివాసగిరిపై ముగిసిన ఉత్సవాలు

శ్రీనివాసగిరిపై ముగిసిన ఉత్సవాలు

పాల్వంచ, వెలుగు : పాల్వంచలోని శ్రీనివాసగిరి గుట్టపై వేంకటేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజులపాటు నిర్వహించిన కల్యాణ మహోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు, యాగశాలలో హోమాలు, మహా పూర్ణాహుతి, సప్త వర్ణ శోభితమైన చక్రస్నాన ఘట్టాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ అర్చకులను భక్తులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఫణి రాజాచార్యులు, భక్త సమాజ మండలి అధ్యక్ష, కార్యదర్శులు ఆరుట్ల లక్ష్మణ్, ధర్మపురి రాము, మిట్టపల్లి నరసింహారావు, మేద రమెట్ల శ్రీనివాసరావు, రాంజీ అంబే ద్కర్, జిన్నే రమేశ్ ​పాల్గొన్నారు.