వైభవంగా గుట్ట వేంకన్న కల్యాణం

వైభవంగా గుట్ట వేంకన్న కల్యాణం

పాల్వంచ, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీనివాసగిరి వేంకటేశ్వర స్వామి కల్యాణం గురువారం వైభవంగా జరిగింది. గోవింద నామస్మరణతో శ్రీనివాసగిరి మారుమోగింది. వనపర్తికి చెందిన సౌమ్యత్రి రామాచార్యులు నేతృత్వంలో ఆలయ ప్రధాన అర్చకులు తోలేటి నగేశ్​కుమార్ శర్మ, ఫణిరాజాచార్యులు స్వామివారి కల్యాణం జరిపించారు. స్వామివారికి స్థానిక తహసీల్దార్ వివేక్  ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు.  కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస రావు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అన్నదానం చేశారు.