
చాలా రోజుల తర్వాత ‘విక్రమ్’ మూవీతో మాసివ్ హిట్ అందుకున్నారు కమల్ హాసన్. బ్లాక్ బస్టర్ టాక్తో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తోందీ సినిమా. ఆ సంతోషంలో ఉన్న తన ఫ్యాన్స్కి మరో ఇంపార్టెంట్ విషయం చెప్పి మరింత ఆనందాన్ని కలిగించారు కమల్. ‘ఇండియన్ 2’ షూటింగ్ త్వరలోనే మొదలు కానున్నట్లు కన్ఫర్మ్ చేశారాయన. రెండేళ్ల క్రితం ఓ క్రేన్ యాక్సిడెంట్ కారణంగా ఆగిపోయిన ఈ మూవీ, తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్ వరకు వెళ్లింది. దీంతో సినిమాకి పూర్తిగా బ్రేక్ పడిపోయిందనుకున్నారంతా. కానీ ఆ ప్రాబ్లెమ్స్ను లీగల్గా పరిష్కరించుకున్నారు మేకర్స్. దాంతో మళ్లీ ఎప్పుడు సినిమా సెట్స్కి వెళ్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఆ టైమ్ వచ్చేసింది అంటున్నారు కమల్. ‘మేం కచ్చితంగా ‘ఇండియన్2’ని పూర్తి చేస్తాం. శంకర్తో పాటు నేను కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎక్సైటింగ్గా ఉన్నాను. మాకంటే ఫ్యాన్స్ మరింత ఆసక్తితో ఉన్నారు. రామ్ చరణ్తో తీస్తున్న మూవీ కంప్లీటవ్వగానే శంకర్ ఈ సినిమాని స్టార్ట్ చేస్తారు’ అన్నారు కమల్. ఈలోపు కమల్ కూడా ఒక సినిమాని వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.