
రెండు వందలకి పైగా సినిమాలు.. వందలకొద్దీ పాత్రలు పోషించిన కమల్ హాసన్ ఇప్పటికీ డిఫరెంట్ క్యారెక్టర్స్తో మెస్మరైజ్ చేస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ సినిమా చేస్తున్నారాయన. కొవిడ్ కారణంగా ఈ మూవీ షూటింగ్కి బ్రేక్ పడింది. లాంగ్ గ్యాప్ తర్వాత రీసెంట్గా చెన్నైలో బ్యాలెన్స్ షూట్ను మొదలుపెట్టారు. క్రోమ్పేటలోని వెట్రీ థియేటర్లో షూట్ జరుగుతోంది. ఈ విషయాన్ని ఆ థియేటర్ ఓనర్ రాకేష్ రివీల్ చేశాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దాదాపు నలభై ఏళ్ల తర్వాత కమల్ ఈ థియేటర్కి రావడం. 1979లో జరిగిన ‘కళ్యాణ రామన్’ వంద రోజుల వేడుకకు కమల్ చివరిసారిగా అక్కడికి వెళ్లారట. మళ్లీ ఇన్నాళ్లకి ఆయన తమ థియేటర్కి రావడం చాలా హ్యాపీగా ఉందంటూ షూటింగ్ అప్డేట్ ఇచ్చాడు రాకేష్. కరోనా కేసులు పెరుగుతుండటంతో తక్కువ మంది టీమ్తో షూట్ చేస్తున్నారు. ఇందులో కమల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్.మహేంద్రన్తో కలిసి కమల్ నిర్మిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మే లేదా జూన్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.