
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కు శనివారం గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ జిష్ణుదేవ్ వర్మ బెస్ట్ బ్లడ్ డోనర్ అవార్డు అందజేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏడాదిలో అధిక సంఖ్యలో రక్తదాన శిబిరాలు నిర్వహించినందున అవార్డు వచ్చింది. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్గా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. ప్రతి వారం ప్రభుత్వ పరంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి ఎక్కువ మంది రక్తదానాలు చేసేలా చూశారని అధికారులు తెలిపారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజల ఆరోగ్య అవసరాల దృష్ట్యా విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహించామన్నారు. గవర్నర్ అవార్డు రావటం ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డు రావడానికి కృషి చేసిన సొసైటీ ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు. కలెక్టర్తో పాటు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎం. రాజన్న, వైస్ ప్రెసిడెంట్ నాగరాజుగౌడ్, స్టేట్ కమిటీ మెంబర్ సంజీవరెడ్డి తదితరులు ఉన్నారు.