కామారెడ్డి, వెలుగు: చదువుతోనే భవిష్యత్కు బలమైన పునాది ఏర్పడుతుందని కామారెడ్డి కలెక్టర్ఆశిష్ సంగ్వాన్అన్నారు. కామారెడ్డి మండలం గర్గుల్ప్రభుత్వస్కూల్లో యూకేజీ ప్రారంభం సందర్భంగా గురువారం చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థుల ప్రగతి కోసం తల్లిదండ్రులు, టీచర్లు, గ్రామస్తులు సమిష్టిగా కృషి చేయాలన్నారు.
అంతకుముందు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో భాగంగా రెండో విడత ఇండ్ల నిర్మాణానికి కలెక్టర్ భూమి పూజ చేశారు. పూరి గుడిసెల్లో నివసిస్తున్న వారికి ప్రభుత్వం సొంతింటి కలలను నేరవేరుస్తోందని అన్నారు. డీఈవో మల్లిఖార్జున్, సర్పంచ్దివ్య తదితరులు పాల్గొన్నారు.
