
కామారెడ్డి, వెలుగు : ఇటీవల పోగొట్టుకున్న సెల్ఫోన్లు, చోరీకి గురైన 107 సెల్ఫోన్లను సీఈఐఆర్ ద్వారా రికవరీ చేసి సంబంధిత వ్యక్తులకు అప్పగించినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర బుధవారం తెలిపారు. ఇప్పటి వరకు 3,150 ఫోన్లను రికవరీ చేశామన్నారు. సెల్ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. సెల్ఫోన్ల రికవరీ కోసం పని చేస్తున్న సిబ్బందిని ఎస్పీ అభినందించారు.