కామారెడ్డిలో 107 సెల్​ఫోన్లు రికవరీ 

కామారెడ్డిలో 107 సెల్​ఫోన్లు రికవరీ 

కామారెడ్డి, వెలుగు : ఇటీవల పోగొట్టుకున్న సెల్​ఫోన్లు,  చోరీకి గురైన 107 సెల్​ఫోన్లను సీఈఐఆర్ ద్వారా రికవరీ చేసి  సంబంధిత వ్యక్తులకు అప్పగించినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్​చంద్ర  బుధవారం తెలిపారు.   ఇప్పటి వరకు 3,150 ఫోన్లను రికవరీ చేశామన్నారు. సెల్​ఫోన్​ పోయిన,  చోరీకి గురైన ఆందోళన చెందవద్దని, పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయాలన్నారు.  సెల్​ఫోన్ల రికవరీ కోసం పని చేస్తున్న సిబ్బందిని ఎస్పీ అభినందించారు.