
ఉపేంద్ర, మీనాక్షి జైస్వాల్, ప్రణీత లీడ్ రోల్స్లో తెరకెక్కుతున్న చిత్రం ‘కంచర్ల’. రెడ్డెం యాద కుమార్ దర్శకుడు. కంచర్ల అచ్యుత రావు నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తిచేసుకుని రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత మాట్లాడుతూ ‘ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతోంది. కేరళ, గోవా, శ్రీకాకుళం, విశాఖపట్నం తదితర ప్రాంతాలలో షూటింగ్ చేస్తున్నాం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
యువత రాజకీయాల్లోకి రావాలని, భూస్వాముల దగ్గర ఉన్న భూమి పేద ప్రజలకు పంచాలన్నది మెయిన్ కాన్సెప్ట్’ అని చెప్పారు. ‘‘ఉపేంద్రగాడి అడ్డా’తో హీరోగా పరిచయమైన తాను, ఈ చిత్రంతో ప్రేక్షకులకు మరింత దగ్గరవబోతున్నట్టు హీరో కంచర్ల ఉపేంద్ర చెప్పాడు. సామాజిక స్పృహతో సమాజాన్ని జాగృతం చేసే అంశాలతో సినిమా తీస్తున్నట్టు దర్శకుడు చెప్పాడు. సుమన్, అజయ్ ఘోష్, కాశీ విశ్వనాథ్, సుధ, రాజా రవీంద్ర, సుమన్ శెట్టి ఇతర పాత్రలు పోషిస్తున్నారు.