ఆర్టీసీ హమాలీలను ప్రభుత్వం ఆదుకోవాలి : కందుల భాస్కర్​

ఆర్టీసీ హమాలీలను ప్రభుత్వం ఆదుకోవాలి : కందుల భాస్కర్​
  • కొత్తగూడెం బస్టాండ్​లో హమాలీల నిరసన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆర్టీసీలో పనిచేస్తున్న హమాలీలను ప్రభుత్వం ఆదుకోవాలని హమాలీ వర్కర్స్​ యూనియన్​ భద్రాద్రికొత్తగూడెం జిల్లా గౌరవ అధ్యక్షుడు కందుల భాస్కర్​ డిమాండ్​ చేశారు. ఈ విషయమై మంగళవారం కొత్తగూడెం బస్టాండ్​లోని కార్గో సెంటర్​ వద్ద హమాలీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ హమాలీలకు ఇచ్చే కమీషన్​ పాత పద్ధతిలోనే చెల్లించాలన్నారు. 

కార్మికులకు పీఎఫ్, ఈఎస్​ఐ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. చాలీచాలనీ డబ్బులతో హమాలీలు కుటుంబాలను పోషించుకోలేక అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోందన్నారు. తమ సమస్యలపై సీఎం రేవంత్​రెడ్డిని కలువనున్నట్టు తెలిపారు. ఈ ప్రోగ్రాంలో యూనియన్​ నాయకులు కొమరయ్య, రాజు, వెంకన్న, నరేశ్, రాంబాబు, వెంకట్రావు, వీర నారాయణ, గంగరాజు పాల్గొన్నారు.