కరీంనగర్‌‌లో యువకుడి ఆత్మహత్య

కరీంనగర్‌‌లో యువకుడి ఆత్మహత్య

కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. గుంటూరు పల్లి వద్ద రైలు వస్తుండగా దానికి కింద పడి వంశీ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ట్రాక్‌పై మృతదేహం పడి ఉండడంతో ఆ ప్రాంతంలో వెళ్తున్న వారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.  

మానకొండూరు మండలం వెల్ది గ్రామానికి చెందిన వంశీ  తల్లితో కలిసి కరీంనగర్ దుర్గమ్మ గుడిలో కొంత కాలంగా నివాసం ఉంటున్నాడని స్థానికులు చెపుతున్నారు. కుటుంబ కలహాలతోనే వంశీ ఆత్మహత్య  చేసుకున్నాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు.