బీఆర్ఎస్​కు మద్దతుగా.. కర్నాటక రైతుల ప్రచారం

బీఆర్ఎస్​కు మద్దతుగా.. కర్నాటక రైతుల ప్రచారం

గద్వాల, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్ తరఫున ఎన్నికల ప్రచారం చేయాలని కర్నాటక రైతు సంఘం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం గద్వాల టౌన్​లోని పాత బస్టాండ్ దగ్గర కర్నాటక రైతు సంఘం, కల్యాణ కర్నాటక సంఘం నేతలు ఆ రాష్ట్ర సర్కారుకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా సంఘం లీడర్లు ధర్మారెడ్డి, నరసింహారెడ్డి, మాట్లాడుతూ.. కర్నాటకలో  అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి రైతులను ముంచిందన్నారు. తమ రాష్ట్రంలో  ప్రస్తుతం కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు.  తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని కోరారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని అన్నారు.